సినీ నటుడు విక్టరీ వెంకటేశ్ కూతురు ఆశ్రిత ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. ఆమె ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామి రెడ్డికి మద్దతుగా ఎన్నిక ప్రచారం నిర్వహించింది. ఆశ్రిత తన స్పీచ్ తో ప్రజలను ఆకట్టుకున్నారు. ఆమె మాట్లాడుతుంటే వెంకటేశ్ అభిమానులు,పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఆనందించారు.
మా మామ రఘురామి రెడ్డి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగి పోటీ చేస్తున్నారు. ఆయన ఏ పనిచేసినా పూర్తిగా చేస్తారు. ఆయనను గెలిపిస్తే మీ సమస్యలను ఢిల్లీ వరకు తీసుకెళ్లి పరిష్కరిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. రఘు రామిరెడ్డిని మెజార్టీతో గెలిపించాలంటూ ఆశ్రిత ఓటర్లకు కోరారు. అంతేకాదు మే 7న తన తండ్రి, వెంకటేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని కూడా ఆమె ప్రజలకు తెలిపారు.
ఇది కూడా చదవండి:ఒకే పేరున్నంత మాత్రాన పోటీ చేయొద్దనలేం