దేశవ్యాప్తంగా వైద్య,విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్షను రేపు(ఆదివారం) నిర్వహించనుంది.ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య జరుగనుంది. ఇప్పటికే అడ్మిట్ కార్డులను విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA). పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్షకు 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు కాకుండా, ఈ పరీక్ష మొత్తం 13 భాషల్లో పెన్, పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతి ఏడాది ఈ పరీక్ష నిర్వహిస్తోంది NTA.
అభ్యర్థులు పరీక్ష మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోరు. అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ వెంట తీసుకురావలసి ఉంటుంది. తెలంగాణలో ప్రధాన నగరాలలోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: అవకాశవాద రాజకీయాలు చేస్తున్న నేతలకు కరీంనగర్ ప్రజలు బుద్ధిచెప్పాలి