అవకాశవాద రాజకీయాలు చేస్తున్న నేతలకు కరీంనగర్ ప్రజలు బుద్ధిచెప్పాలని సూచించారు బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. ఇవాళ(శనివారం) కరీంనగర్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్, పార్టీ నాయకులతో కలిసి వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రైతుబంధు ఎప్పుడు ఇవ్వాలో కూడా రేవంత్ రెడ్డికి తెలియదని విమర్శించారు. కరెంటు సరిగా లేక రైతుల మోటార్లు కాలిపోతున్నాయన్నారు. బీఆర్ఎస్ పాలనలో కరెంటు ఎందుకు పోలేదు.. ఇప్పుడు ఎందుకు పోతోందని ప్రశ్నించారు.. ఇండ్లలో మళ్లీ ఇన్వర్టర్లు కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేస్తొందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామాల్లో బీఆర్ఎస్ కు అపూర్వ స్పందన వస్తోందన్నారు బోయినపల్లి వినోద్ కుమార్. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. కరీంనగర్కు బీజేపీ,, కాంగ్రెస్ నేతలు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం కృషి చేశానన్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్కు రైల్వే లైన్కోసం నిధులు తీసుకొచ్చానని చెప్పారు. కేబుల్ బ్రిడ్జి నిర్మించి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామని చెప్పారు. కరీంనగర్కు ఉన్నత విద్యా సంస్థలు తేవాలనేది తన లక్ష్యమని పట్టణానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తీసుకొస్తానని, సింగపూర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పారు.
ఇన్నాళ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్లోకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు వినోద్ కుమార్. కరీంనగర్ ప్రజలు అభివృద్ధి కోరుకుంటారో.. విధ్వంసం కోరుకుంటారో ఆలోచించాలన్నారు. పని చేసే నాయకులకే ప్రజలు ఓటు వేయాలని కోరారు. అవకాశవాద రాజకీయాలు చేస్తున్న నాయకులకు ప్రజలు బుద్ధిచెప్పాలన్నారు గంగుల కమలాకర్ అన్నారు. రాబోయే రోజుల్లో కాలమే వారికి తగిన బుద్ధి చెబుతుందన్నారు.
ఇది కూడా చదవండి:విషాదమైన విహారయాత్ర: కారు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి