ఎన్నికలు సమీపిస్తుండటంతో కొంత మంది నేతలు పార్టీలు మారుతూ జంపింగ్ లు చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని పార్టీల పరిస్థితి అలానే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ప్రచారానికి డబ్బులు లేవనే కారణంతో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నారు. తనకు కేటాయించి టికెట్ ను పార్టీకి వెనక్కి ఇచ్చేశారు. ఇది ఒడిశాలో జరిగింది.
పూరి లోక్సభ స్థానం నుంచి బరిలో ఉన్న ఆ పార్టీ అభ్యర్థి సుచిత్ర మొహంతీ తన టికెట్ను పార్టీకి వెనక్కి ఇచ్చేశారు. ప్రచారానికి అవసరమైన నిధులు తన దగ్గర లేవని… పార్టీ కూడా తగినన్ని నిధులు ఇవ్వలేదని తెలిపారు. ప్రజల నుంచి విరాళాలు సేకరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, ఖర్చులు తగ్గించుకున్నప్పటికీ ప్రచారం ప్రభావవంతంగా సాగడం లేదని సుచిత్ర ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ నుంచి నాకు ప్రచారం కోసం నిధులు రాలేదు.అంతేకాదు ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ప్రచారంతో పోటీ పడలేక పోతున్నానని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బుల్లేకుండా ఎన్నికల్లో పోటీకి దిగడం అంత ఈజీ కాదన్నారు. దీంతో పోటీ నుంచి తప్పుకుంటున్నాట్లు సుచిత్ర తెలిపారు.
ఇది కూడా చదవండి:బీజేపీ మతం పేరుతో రాజకీయం చేస్తోంది