హైదరాబాద్ శివారులోని ఘట్ కేసర్ లో దారుణం జరిగింది. ఆస్తికోసం ఓ మహిళ తన భర్తను ఇనుపగొలుసులతో కట్టేసింది. అంతటితో ఊరుకోలేదు చిత్రహింసలకు గురిచేసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన గురించి పోలీసులకు తెలియడంతో ఆయనకు విముక్తి లభించింది. ఘట్ కేసర్ లోని అంబేడ్కర్ నగర్ కు చెందిన భారతమ్మ, నరసింహా భార్య భర్తలు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సెంట్రింగ్ కాంట్రాక్టర్ అయిన నరసింహా తన భార్య పేరుతో ఉన్న స్థలంలో నరసింహ ఇళ్లు కడుతున్నాడు. దీనికోసం చేసిన అప్పు తీర్చేందుకు నరసింహ తన పేరుపై ఉన్న మరో స్థలం అమ్ముతానని భార్యకు చెప్పాడు.
దీంతో దంపతుల మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే ఏడాది క్రితం ఆయన ఇల్లు వదిలివెళ్లిపోయాడు. అప్పట్నుంచి ఆయన అతని ఆచూకీ దొరకలేదు. గత నెల 30న నరసింహ యాదాద్రి భవనగిరి జిల్లా పడమటి సోమారంలో ఉన్నట్లు భారతమ్మకు తెలిసింది. కుమారులతో కలిసి వెళ్లి భర్తను తీసుకుని వచ్చింది. అనంతరం నరసింహను గదిలో వేసి ఇనుపగొలుసులతో కట్టేసింది. ఇంటి స్థలాన్ని తనపేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని చిత్రహింసలకు గురిచేసింది. దీన్నంత వీడియో తీసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నరసింహను విడిచి స్టేషన్ కు తరలించారు. భార్య భారతమ్మ, కుమారుడు గణేణ్, రాజులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ప్రచారానికి డబ్బుల్లేక పోటీ నుంచి తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్థి