బీజేపీ మతం పేరుతో రాజకీయం చేస్తోందని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలా మతం పేరుతో రాజకీయం చేసే వాళ్లను నమ్మెద్దన్నారు. ఇవాళ(శనివారం) సిరిసిల్ల పట్టణంలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం చేశారు. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ను గెలిపించాలని కోరారు. ప్రధాని మోడీ వల్ల తెలంగాణకు ఒక్క రూపాయి కూడా లాభం జరుగలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేత కార్మికులకు ఉపాధి ఉండేదని..ఇప్పుడు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్.
కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ను గెలిపించాలని కోరారు. సిరిసిల్లలో బీజేపీ ఏం అభివృద్ధి చేసిందే చెప్పాలన్నారు. మతం పేరుతో రాజకీయం చేసేవాళ్లను నమ్మొద్దని, వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు కేటీఆర్. ఇంతకు ముందు బ్రిడ్జి కింద నీళ్లు ఉండేవని, కాంగ్రెస్ వచ్చింది నీళ్లు లేకుండా పోయాయని విమర్శించారు. కాళేశ్వరం, మిడ్మానేరు ప్రాజెక్టులను కట్టించింది కేసీఆరేనని గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి:సిరిసిల్ల రైతుబజార్లో కేటీఆర్ ప్రచారం.. ఫొటోలు వైరల్.!