Saturday, May 18, 2024

సిరిసిల్ల రైతుబజార్‌లో కేటీఆర్‌ ప్రచారం.. ఫొటోలు వైరల్.!

spot_img

కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బి. వినోద్ కుమార్ కు మద్దతుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల పట్టణంలో ప్రచారం చేశారు. పట్టణంలోని రైతు బజార్ లో బీఆర్ఎస్ కు ఓటేయ్యాలని రైతులు, వ్యాపారులను కలిసి కోరారు. అనంతరం వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న ఓ హోటల్లో స్థానికులతో కలిసి చాయ్ తాగారు. ఓట్లు అడిగేందుకు రైతు బజార్ కు వచ్చానని చెప్పారు కేటీఆర్. ఈ సందర్భంగా తాము కూర్చుని కూరగాయలు అమ్ముకునేలా షెడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని రైతులు కేటీఆర్ ను కోరారు. దీంతో 24గంటల్లోపు వారికి తాత్కాలిక వసతి కల్పించేలా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు.

కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందని..కేసీఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత తమ వాగుల్లో నీళ్లు పోయాయని..ఓ నెల ఫించన్ కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ కేసీఆర్ వస్తేనే పేదలకు బాగుంటుందని అంతా అనుకుంటున్నారని కేటీఆర్ చెప్పారు. వారి స్పందన చూస్తుంటే బోయినపల్లి వినోద్ కుమార్ భారీ మెజార్టీతో గెలుస్తారన్న నమ్మకం ఉందని తెలిపారు.

ఇది కూడా చదవండి: వేసవిలో ఈ కూరగాయలు తప్పనిసరిగా తినండి.!

Latest News

More Articles