Saturday, May 18, 2024

మాదిగలు, బీసీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించాలి

spot_img

సీఎం రేవంత్ రెడ్డి మన బలమేంటో చూపిద్దామన్నారు ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క మాదిగ సామాజిక వర్గానికి సీటు ఇవ్వకపోవడాన్ని ఖండిస్తూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఇవాళ(శనివారం) హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర ధర్నానిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోత్కుపల్లి..నా అక్కాచెల్లెల్లందరికీ చెబుతున్నా… రేవంత్ రెడ్డికి ఓటేస్తే నన్ను మీరు చంపినట్లే. మీ కోసం నా జీవితం ఇస్తా. మీ కోసం నా ప్రాణం ఇస్తా. ఈ జాతి గౌరవం నిలబడాలి. మన బలమేంటో..సత్తా ఏంటో సీఎంకు తెలియాలన్నారు.

తెలంగాణలో మూడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఒక్క సీటు ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి మాదిగల బలమేందో చూపించాలన్నారు మోత్కుపల్లి. మాదిగల బలం కాంగ్రెస్ పార్టీకి తెలిసేలా చేస్తామన్నారు. తమకు గౌరవం ఇవ్వకపోతే కాంగ్రెస్‌ను పాతిపెడతామన్నారు. పుట్నాలు పంచితే ప్రజలు ఓటేశారనుకున్నావా? పుట్నాలకు ఆశపడే వాళ్లం కాదు… ఆత్మగౌరవం.. మా జాతి గౌరవం మాకు ముఖ్యమన్నారు. మాకు గౌరవిస్తే సహకరిస్తామని… గౌరవించకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మాదిగలు, బీసీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించాలన్నారు.

ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ మాదిగలను అవమానించిందన్నారు మంద కృష్ణ మాదిగ. తమ ఇందిరా పార్క్ దీక్షను పక్కదారి పట్టించేందుకు రేవంత్ రెడ్డి గాంధీ భవన్‌లో దళితుల ఆధ్వర్యంలో ధర్నా ఏర్పాటు చేశారని ఆరోపించారు. దేశంలో రాజ్యాంగానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. మాదిగల ఓట్లతో కాంగ్రెస్ పార్టీకి మాత్రం ప్రమాదం ఉందన్నారు మంద కృష్ణ.

ఇది కూడా చదవండి: అవకాశవాద రాజకీయాలు చేస్తున్న నేతలకు కరీంనగర్  ప్రజలు బుద్ధిచెప్పాలి

Latest News

More Articles