Saturday, May 18, 2024

టీ20 వరల్డ్ క‌ప్‌ జ‌ట్టులో అందుకే రింకూకు స్థానం ద‌క్క‌లేదు

spot_img

రాబోయే టీ20 ప్రపంచకప్ కోసం ఏప్రిల్ 30 బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన తుది జట్టును ప్రకటించింది. అయితే అందలో యువ బ్యాట‌ర్ రింకూ సింగ్‌కు స్థానం దక్కలేదు. దీనిపై ఇప్ప‌టికే చాలా మంది మాజీ క్రికెట‌ర్లు రింకూకు టీమిండియాలో చోటు క‌ల్పించి ఉంటే బాగుండేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. పొట్టి ఫార్మాట్‌కు అత‌ని బ్యాటింగ్ శైలి స‌రిగ్గా స‌రిపోతుందని, ఇప్ప‌టికే భార‌త్‌కు ప్రాతినిధ్యం వ‌హించి ఈ విష‌యాన్ని రుజువు చేశాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భార‌త మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ కూడా టీ20 వరల్డ్ క‌ప్‌ జ‌ట్టు ఎంపిక‌పై మీడియాతో మాట్లాడారు.

జ‌ట్టులో స్పిన్న‌ర్ అవసరం ఉండటంతోనే రింకూ సింగ్‌కు స్థానం దక్కలేదన్నారు సౌరవ్. అత‌నికి ఇంకా చాలా కెరీర్ ఉంది. టీమిండియా త‌ర‌ఫున ఇంకా చాలా మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ నిర్ణ‌యంపై రింకూ నిరుత్సాహ‌ప‌డాల్సిన అవసరం లేదన్నారు.

ఇక జూన్ 2వ తేదీ నుంచి ఈ ఐసీసీ టోర్నీ ప్రారంభం కానుంది. జూన్ 29న జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌తో ఐసీసీ టోర్నీ ముగుస్తుంది. అమెరికా, వెస్టిండీస్ కలిసి ఆతిథ్య‌మిస్తున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జ‌ట్లు, ఐదు గ్రూపులుగా విడిపోయి త‌ల‌ప‌డ‌నున్నాయి. జూన్ 5న ఐర్లాండ్‌తో భార‌త్ తొలి మ్యాచ్ ఆడ‌నుంది. మరోవైపు భార‌త్‌, పాకిస్థాన్ పోరుకు న్యూయార్క్ వేదిక కానుంది. జూన్ 9వ తేదీన ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 భార‌త జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), సంజు శాంసన్ (కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.

రిజర్వ్ ఆట‌గాళ్లు: శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.

టీ 20 ప్రపంచకప్‌లో భార‌త్‌ షెడ్యూల్..

.. భార‌త్ వ‌ర్సెస్‌ ఐర్లాండ్‌ – జూన్‌ 5 (న్యూయార్క్)
..భార‌త్ వ‌ర్సెస్‌ పాకిస్తాన్‌ – జూన్‌ 9 ( న్యూయార్క్)
..భార‌త్ వ‌ర్సెస్‌ యూఎస్‌ఏ – జూన్‌ 12 (న్యూయార్క్)
..భార‌త్ వ‌ర్సెస్ కెనడా – జూన్‌ 15 (ఫ్లోరిడా)

ఇది కూడా చదవండి:రివర్స్ గేర్లో పోతున్న కాంగ్రెస్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నరు

Latest News

More Articles