ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 19 మంది దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన మెక్సికోలో మంగళవారం జరిగింది. నార్త్ వెస్ట్రన్ సినాలోవా రాష్ట్రంలోని మజాట్లాన్-లాస్ మోచిస్ నగరాల మధ్య తిరుగుతున్న బస్సు కోస్టల్ హైవేపై ప్రయాణిస్తున్నక్రమంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 19మంది మరణించగా.. మరో 22 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం సమయంలో బస్సులో 37మంది ప్రయాణికులున్నట్లు అధికారులు తెలిపారు. బస్సు, ట్రక్కు ఢీకున్నవెంటనే బస్సులో మంటలు చెలరేగాయి, దాంతో బస్సు మంటల్లో పూర్తిగా దగ్దమైంది. ఈ ప్రమాదంతో హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారమందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Read Also: నేడు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లలో వెళ్లొద్దు