తెలంగాణలో రేపటి( శుక్రవారం) నుంచి ఆఫ్ డే స్కూళ్లు మొదలుకానున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరిగిపోతున్న కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజన పథకం మాత్రం యధావిధిగా కొనసాగుతుంది. 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులకు కూడా కొనసాగుతాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉదయం 8 గంటలకు తరగతులు మొదలై మధ్యాహ్నం 12.30కు జరుగుతాయి. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. పదవ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత ఆ బడుల్లోనూ ఒంటిపూట తరగతులు నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి: రాజ్యసభ ఎంపీగా సుధా మూర్తి ప్రమాణ స్వీకారం