ఈ మధ్యకాలంలో గుండెపోటు వయసుతో సంబంధం లేకుండా వస్తోంది. దాంతో ఎవరు ఎప్పుడు గుండెపోటుకు గురవుతారోనని భయపడుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో గుండెపోటుతో 14 ఏండ్ల బాలుడు మృతిచెందాడు. ఖమ్మం నగరంలోని ఎన్నెస్పీ కాలనీకి చెందిన మాదాసి రాజేశ్ (14) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. రోజులాగే బుధవారం ఉదయం రాజేశ్ బడికి వెళ్లాడు. కొద్దిసేపటికే ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలాడు. గుర్తించిన ఉపాధ్యాయులు వెంటనే రాజేశ్ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కుమారుడి మృతితో రాజేశ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.