బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు ఒకసారి మాట ఇచ్చారంటే తప్పరు అనే పేరుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేటీఆర్ ఎన్నో సమస్యలపై స్పందిస్తుంటారు. ఏ చిన్న ఆపద వచ్చినా నేనున్నా అంటూ అండగా నిలుస్తున్నారు. ప్రజాసమస్యలుకావచ్చు..వ్యక్తిగత సమస్యలు కావచ్చు..చాలా మందికి బాసటగా నిలుస్తున్నారు. అయితే ఈ మధ్య కొందరు చిన్నారులు తమ పాఠశాల వార్షికోత్సవానికి రావాలంటూ కేటీఆర్ కు సోషల్ మీడియాలో ఆహ్వానించారు. చిన్నారులు అప్ లోడ్ చేసిన వీడియోను చూసిన కేటీఆర్ వారి ఆహ్వానానికి మంత్రముగ్దుడయ్యారు. ముందు నిర్ణయమైన కార్యక్రమాలను పక్కన పెట్టి చిన్నారలు కోసం పాఠశాల వార్షికోత్సవానికి హాజరయ్యారు. రాజేంద్రనగర్ లోని హైదరాబాద్ మిలీనియం పాఠశాల వార్షికోత్సవం ఆదివారం జరిగింది.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.
👉 మూడు రోజుల కింద రాజేంద్రనగర్లోని మిలీనియం స్కూల్ విద్యార్థులు కొంతమంది ఒక చిన్న వీడియో తయారుచేసి తమ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని కేటీఆర్కి సామాజిక మాధ్యమం ఎక్స్లో విజ్ఞప్తి చేశారు.
👉 ఆ పోస్ట్… pic.twitter.com/n7m5KPeMIV
— BRS Party (@BRSparty) March 3, 2024
నాలుగు రోజుల క్రితం ఈ పాఠశాలకు చెందిన పలువురు చిన్నారులు కేటీఆర్ ను తమ వార్షికోత్సవానికి హాజరుకావాలని కోరారు. ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. దానికి స్పందించిన కేటీఆర్ గెస్టుగా వెళ్లారు చిన్నారులు ఆహ్వానించిన తీరు తనకుబాగా నచ్చడంతోనే వచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారులతో సరదాగా ముచ్చటించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది కూడా చదవండి: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు..సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి .!