Friday, May 17, 2024

క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు..సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి .!

spot_img

క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు వచ్చి ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం..విశాఖ జిల్లా పెద్దగంట్యాడ మండలం మీంది గ్రామానికి చెందిన కాశిరెడ్డి సంజయ్ భార్గవ్..గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ టీసీఎస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఘట్టుపల్లిలోని కేసీఆర్ క్రికెట్ స్టేడియంలో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. శనివారం ఉదయం 1130 గంటలకు గచ్చిబౌలి నుంచి దిలీప్, బాలప్రదీప్, అజయ్, తేజకిరణ్, ఆదిత్య స్నేహితులో కలిసి భార్గవ్ స్టేడియానికి వచ్చాడు. క్రికెట్ ఆడుతుండగా మధ్యాహ్నం మూడుగంటల సమయంలో తలనొప్పిగా ఉందని ఆట మధ్యలోనే పక్కకు వచ్చి కూర్చున్నాడు. కొద్ది సేపటికే కుప్పకూలాడు. వెంటనే ఫిట్స్ రావడంతో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో ఘోరరోడ్డు ప్రమాదం..ఐదుగురు దుర్మరణం.!

Latest News

More Articles