Friday, May 3, 2024

తెలంగాణలో ఘోరరోడ్డు ప్రమాదం..ఐదుగురు దుర్మరణం.!

spot_img

వనపర్తి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని సమీప ఆసుపత్రిలో చేర్పించారు. బళ్లారి నుంచి హైదరాబాద్ కు కారులో వస్తున్న సమయంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. వనపర్తిజిల్లాలోని కొత్తకోట జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదం తెలిసిన వెంటనే ఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

మరణించినవారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 2గంటల నుంచి 3 గంటల మధ్యలో జరిగింది. ప్రమాద సమయంలో కారులో 13 మంది ప్రయాణీస్తున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మరణించారు. చికిత్స పొందుతున్నవారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. డ్రైవర్ నిద్రమత్తుతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: కరీంనగర్ నుంచే లోకసభ ఎన్నికల శంఖారావం..ప్రకటించిన గులాబీ బాస్.!

Latest News

More Articles