ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీవెడ్డింగ్ ఈవెంట్ మూడు రోజులు పాటు ఘనంగా సాగుతోంది. దేశం నుంచే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు కూడా ఇందులో పాల్గొన్నారు. రాధికా-అనంత్ అంబానీల ప్రీ-వెడ్డింగ్ వేడుక గుజరాత్లోని జామ్నగర్లో జరిగింది. ప్రపంచ నాయకులు, బాలీవుడ్ సెలబ్రిటీలు, బిలియనీర్లతో సహా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రముఖ అతిథులు తరలివచ్చారు. గ్రామీ అవార్డు గెలుచుకున్న గాయని రిహన్నా ఆతిథ్యం ఇచ్చారు.
జామ్నగర్లో మూడు రోజుల పాటు జరుగుుతున్న ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యే అతిథుల కోసం అంబానీ కుటుంబం వివిధ విలాసవంతమైన, ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. ముంబయి, ఢిల్లీ నుండి జామ్నగర్కు చార్టర్డ్ విమానాలు, ప్రపంచ స్థాయి చెఫ్లు, వార్డ్రోబ్ సేవలు, అతిథులను ఎయిర్ పోర్టు నుంచి జామ్ నగర్ తీసుకువచ్చేందుకు లగ్జరీ కార్లు, రిహన్న, అరిజిత్ సింగ్, దిల్జిత్ దోసాంజ్, అజయ్-అతుల్ వంటి ప్రముఖ కళాకారుల సంగీత ప్రదర్శనలు ఇందులో ఉన్నాయి.
ప్రముఖ అతిథులను విమానాశ్రయం నుంచి వేదిక వద్దకు తరలించేందుకు ముకేశ్ అంబానీ విలాసవంతమైన వాహనాలను ఏర్పాటు చేశారు. ఏ సెలబ్రిటీలు ఏ వాహనాల్లో వచ్చారో చూద్దాం.
రోల్స్ రాయిస్ ఘోస్ట్లో కింగ్ ఖాన్:
బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ జామ్నగర్లో అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్కు రోల్స్ రాయిస్ ఘోస్ట్లో వచ్చారు. ఈ కారు ధర రూ.10 కోట్లు. పెళ్లికి ముందు కుటుంబ సమేతంగా వచ్చాడు. విశేషమేమిటంటే షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ కోసం రూ.4 కోట్ల విలువైన ల్యాండ్ రేంజ్ రోవర్ పేరుతో ఓ ప్రత్యేక కారును పంపారు.
బెంట్లీ బెంటగాలో సల్మాన్:
బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెన్నెముక అయిన సల్మాన్ ఖాన్ కూడా ఈ వేడుకలకు వచ్చారు. బెంట్లీ బెంటాయిగాలో సల్మాన్ ప్రీ వెడ్డింగ్ వేడుకలోకి ప్రవేశించాడు. అంబానీ కుటుంబమే ఆయనకు ఈ వాహనాన్ని ఏర్పాటు చేసింది. ఈ లగ్జరీ సెడాన్ ధర 7 కోట్ల రూపాయల కంటే ఎక్కువ.
రణబీర్-అలియా రేంజ్ రోవర్లో:
అనంత్ – రాధిక ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్కు హాజరు కావడానికి రణబీర్ కపూర్, అలియా భట్ వచ్చారు . వారిని తీసుకురావడానికి రేంజ్ రోవర్ ఎస్యూవీని ఏర్పాటు చేశారు.
నీతూ కపూర్ కోసం మేబ్యాక్:
రణబీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ సింగ్ అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ బాష్ వద్దకు వచ్చారు. నీతూ కోసం రూ.4 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ కారును పంపించారు. అర్జన్ కపూర్, కత్రినాల కోసం అంబానీలు ప్రత్యేక లగ్జరీ కార్లను పంపినట్లు వార్తలు వచ్చాయి.
ఇది కూడా చదవండి: కరీంనగర్ నుంచే లోకసభ ఎన్నికల శంఖారావం..ప్రకటించిన గులాబీ బాస్.!