సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. ఈ ఎన్నికల నేపథ్యంలో త్వరలోనే బస్సు యాత్రలు కూడా చేద్దామని పార్టీ నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈఎన్నికల్లో బీఆర్ఎస్ , బీజేపీ మధ్య తగ్గాపర్ పోటీ ఉంటుందన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆదివారం కరీంనగర్ నియోజకవర్గ నేతలో కేసీఆర్ సమావేశం అయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు, వినోద్ కుమార్, సంతోష్ కుమార్, గంగులకమలాకర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. లోకసభ ఎన్నికలకు పార్టీ కార్యచరణ, అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ చర్చించారు. మండలస్థాయిలో పార్టీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ గెలవబోతుందని..కేసీఆర్ చెప్పారు. ఈనెల 12వ తేదీని కరీంనగర్ లోని ఎస్సారార్ కాలేజీ మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు ఏర్పాట్లు చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న కేసీఆర్..బీఆర్ఎస్ తో మేలు జరుగుతుందన్న చర్చ ప్రజల్లో మొదలైందన్నారు. అసెంబ్లీ ఫలితాలను పట్టించుకోవద్దని..అంతా కలిసికట్టుగా పనిచేయాలని కేసీఆర్ నేతలకు సూచించారు.
ఇది కూడా చదవండి : ఇందిరమ్మ ఇళ్లకు వచ్చిన దరఖాస్తులెన్నో చెప్పాల్సిందే: బండి సంజయ్ డిమాండ్.!