హైదరాబాద్ నగర శివారులో సంచిలో మృతదేహం దొరికింది. నగర శివారు బ్రాహ్మణపల్లి ఔటర్ రింగురోడ్డు సమీపంలో ఓ మూటలో లభించిన మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. గోనె సంచిలో మృతదేహాన్ని మూటకట్టి గుర్తుతెలియని వ్యక్తులు ఓఆర్ఆర్ పై నుంచి కిందకి విసిరేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాప్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: వాహనదారులకు అలర్ట్.. జనవరి 31లోగా కేవైసీ చేయించుకోకపోతే బ్లాక్లిస్ట్