పబ్జీ గేమ్కు అలవాటు పడి ఓ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎల్లారెడ్డిగూడలో నివాసముంటున్న అఖిల్ (21) అనే విద్యార్థి తల్లి జయతో కలిసి ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటున్నాడు. అఖిల్ తండ్రి 2018లో చనిపోయాడు. అయితే అఖిల్ మూడు నెలలుగా కాలేజీకి వెళ్లకుండా పబ్జీ గేమ్కు బానిసయ్యాడు. బుధవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అఖిల్ తల్లి జయ బయటకు వెళ్లి వచ్చేసరికి ఇంటి డోర్ లాక్ చేసి ఉంది. వాచ్ మెన్ సాయంతో డోర్ బద్దలు కొట్టి చూడగా అఖిల్ ఉరివేసుకొని కనిపించాడు. వెంటనే అఖిల్ని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. నిమ్స్ ఆస్పత్రి సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: బిల్లులు అడ్డుకుంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఉపసర్పంచ్ ఆత్మహత్యాయత్నం