హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కలిగిరి మండలం కుమ్మర కొండూరు గ్రామంలో కరెంట్ షాక్ తగలడంతో ఇద్దరు దుర్మరణం చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మర కొండూరు గ్రామానికి చెందిన రైతు మల్లికార్జునరెడ్డి (35) పొలం వద్ద బోరు మోటారు పాడైంది. అయ్యప్పరెడ్డి పాలెంకు చెందిన ప్రైవేట్ మెకానిక్ నారాయణ(40) ను తీసుకొచ్చాడు.
ఈరోజు పొలం వద్ద మోటార్కు మరమ్మతులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి మృతదేహాలను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.