సీఎం కేసీఆర్ రేపు(శుక్రవారం) ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా ఆసిఫాబాద్ కేంద్రంలోని బహిరంగ సభలో పాల్గొననున్నారు సీఎం. దీని కోసం ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ దండె విఠల్, జెడ్పీ చైర్మన్ కోవ లక్ష్మి తో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు,ఉన్నతాధికారులు పరిశీలించారు.సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు మంత్రి.