Sunday, May 19, 2024

దారుణం.. సూపర్ మార్కెట్లో షాక్ తగిలి నాలుడేండ్ల చిన్నారి మృతి

spot_img

నిజామాబాద్ నందిపెట్ లోని ఎన్ మార్ట్ లో కరెంటు షాక్ తగిలి చిన్నారి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. నందిపేట మండల కేంద్రలోని ఎన్ మార్ట్ సూపర్ మార్కెట్ లో సోమవారం ఉదయం 7-35 సమయంలో నవీపేట గ్రామానికి చెందిన గూడూరు రిషిత(4) తన తండ్రితో పాటు సూపర్ మార్కెట్లోకి వెళ్ళింది. చాక్లెట్స్ కావాలని ఫ్రిడ్జ్ డోర్ దగ్గరికి వెళ్లి తాకిన వెంటనే కరెంటు షాక్ తలిగి కదలిక లేకపోవడంతో పక్కనే ఉన్న తన తండ్రి గమనించి చిన్నారిని లాగేసుకొని చూసేసరికి స్పృహ తప్పిపోయింది.

Also Read.. యూపీలో దారుణం.. భూవివాదంలో కాల్పులు.. ఆరుగురు మృతి

వెంటనే నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు.  రిషిత కరెంట్ షాక్ వల్ల చనిపోయినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. వందలమంది షాపింగ్ కొరకు వచ్చే సూపర్ మార్కెట్లో కనీస రక్షణ చర్యలు లేకుండా నిర్వర్తిస్తున్న షాపింగ్ మాల్ నిర్వాహకులు అలసత్వం వల్ల అమాయక చిన్నారి ప్రాణాలు బలయ్యందని, పాప చనిపోవడానికి కారణమైన వారిపై చర్య తీసుకోవాలని కుటుంబ సభ్యులు, ప్రజలు కోరుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles