Sunday, May 12, 2024

ఐటీ అధికారులమంటూ.. బంగారం షాపులో చోరీ

spot_img

సికింద్రాబాద్ : సిద్ధి వినాయక జువెలర్స్ లో దొంగలు పడ్డారు. ఐటీ అధికారుల పేరుతో కొందరు దుండగులు బురిడీ కొట్టించి కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. షాపు యజమాని కథనం ప్రకారం.. ఐటి అధికారులమంటూ 6 మంది షాపులోకి చొరబడి.. సోదాలు నిర్వహించి సుమారు 17 వందల గ్రాముల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

ఈ వ్యవహారం మొత్తం సుమారు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో చోటుచేసుకుంది. వెంటేనే అప్రమత్తమైన షాపు యజమాని మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. షాపులో పనిచేసే సిబ్బందితో పాటు పలువురుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దొంగల ముఠా కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు ఏసీపి రమేష్ తెలిపారు.

Latest News

More Articles