ఉత్తర్ ప్రదేశ్లో దారుణం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న ఐదుగురిని అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేసి.. ఆ తర్వాత తనూ గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. మైన్పురి జిల్లాలోని గోకుల్పుర్ లో ఇవాళ(శనివారం) తెల్లవారుజామున జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
గోకుల్పుర్కు చెందిన శివవీర్ యాదవ్(30).. తన సోదరులు భుల్లన్ యాదవ్(25), సోనూ యాదవ్(21), సోనూ భార్య సోనీ(20), బావ సౌరభ్(23), స్నేహితుడు దీపక్ (20)లను గొడ్డలితో నరికి చంపేశాడు. దీంతో వారంతా అక్కడికక్కడే మృతిచెందారు. తర్వాత భార్య డాలీ, మేనత్తపై దాడికి పాల్పడ్డాడు. తర్వాత తనను తాను గన్తో కాల్పులకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన నిందితుడు శివవీర్ యాదవ్.. మేనత్త, భార్యను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.