Friday, May 17, 2024

యూపీలో నిద్రిస్తున్న ఐదుగురిని చంపిన వ్యక్తి గన్ తో కాల్చుకుని మృతి

spot_img

ఉత్తర్​ ప్రదేశ్​లో దారుణం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న ఐదుగురిని అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేసి.. ఆ తర్వాత తనూ గన్​తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. మైన్​పురి జిల్లాలోని గోకుల్​పుర్ ​లో ఇవాళ(శనివారం) తెల్లవారుజామున జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

గోకుల్​పుర్​కు చెందిన శివవీర్ యాదవ్​(30).. తన సోదరులు భుల్లన్ యాదవ్​​(25), సోనూ యాదవ్(21), సోనూ భార్య సోనీ(20), బావ సౌరభ్(23), స్నేహితుడు దీపక్​ (20)లను గొడ్డలితో నరికి చంపేశాడు. దీంతో వారంతా అక్కడికక్కడే మృతిచెందారు. తర్వాత భార్య డాలీ, మేనత్తపై దాడికి పాల్పడ్డాడు. తర్వాత తనను తాను గన్​తో కాల్పులకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన నిందితుడు శివవీర్ యాదవ్​.. మేనత్త, భార్యను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

Latest News

More Articles