రంగారెడ్డి జిల్లా రోడ్డు ప్రమాదం జరిగింది. షాద్నగర్లోని సోలిపూర్ గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న లారీని బొలేరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఇవాళ(శనివారం) ఉదయం బెంగళూరు జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న బొలేరో వాహనం అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.