వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్లో దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తి చెవులు, ముక్కు, నాలుకను కోసి అతి కిరాతకంగా చంపేశారు. మృతుడు దౌల్తాబాద్కు చెందిన సంగేపల్లి శేఖర్(32)గా పోలీసులు గుర్తించారు. దౌల్తాబాద్కు చెందిన శేఖర్(32)ను అదే గ్రామానికి చెందిన గోపాల్ బైక్ పై తీసుకెళ్లాడని.. పాత కక్షలు, వివాహేతర సంబంధం నేపథ్యంలో శేఖర్ను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నిందితుడు గోపాల్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.