రంగారెడ్డి జిల్లా నార్సింగీలో డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ తీసుకుంటున్న విద్యార్థిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సన్ సిటీ వద్ద ఓ విద్యార్థి డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 5 గ్రాముల MDMA డ్రగ్స్, 14 ఇన్సులిన్ సిరెంజస్, ఓ వెయింగ్ మిషన్తో పాటు నాలుగు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. కాగా.. డ్రగ్స్తో పట్టుబడ్డ విద్యార్థిని ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లాలోని గన్నవరానికి చెందిన సాకేత్గా గుర్తించారు.
సాకేత్ బెంగుళూరులో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ డ్రగ్స్ను రాజేంద్రనగర్ ప్రాంతంలో విక్రయించడానికి వచ్చి పోలీసులకు పట్టుబడ్డట్లు తెలుస్తోంది. సాకేత్ మీద NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ ఎవరికి విక్రయించడానికి వచ్చాడు? బెంగుళూరులో సాకేత్కు డ్రగ్స్ ఎవరు ఇచ్చారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.