ఖమ్మం జిల్లా: సత్తుపల్లి తామర చెరువులో ఇద్దరు పిల్లలతో సహా దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది. మృతులను పాటిబండ్ల మృదుల (40), ప్రజ్ఞాన్ (8), మహాన్ (5) లుగా గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడ్డ మృదుల సత్తుపల్లి ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఉంటున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణం అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.