హైదరాబాద్: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ లోని తరంగిణి విమెన్స్ హాస్టల్ లో రత్న కుమారి అనే యువతి సూసైడ్ చేసుకుంది. రత్నకుమారి అనే యువతి అనారోగ్య సమస్యల వల్ల సూసైడ్ చేసుకున్నట్లు భావిస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ మార్చురీకి కి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న తరంగిణి ఆమె గదిలో కాకుండా పక్క గదిలో ఉరి వేసుకునీ ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.