హైదరాబాద్ : బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సాపూర్ చౌరస్తా నుండి జీడిమెట్లకు వెళ్లే ప్రధాన రహదారి పై ద్విచక్ర వాహనాన్ని కాంక్రీట్ మిక్సర్ లారీ ఢీకొట్టింది.
ప్రమాదంలో మహేందర్ (21)అనే వ్యక్తి మృతి చెందాడు. బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.