న్యూఢిల్లీ: ‘బ్రిక్స్’ కూటమిలో కొత్తగా మరో 6 దేశాలు చేరనున్నాయి. ప్రస్తుతం బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా దేశాలు ‘బ్రిక్స్’లో శాశ్వత సభ్యులుగా ఉన్నాయి.
ప్రస్తుతం దక్షిణ ఆఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరుగుతున్న ‘బ్రిక్స్’ సమ్మిట్లో ఈ మేరకు నిర్ణయించారు. గ్రూప్లోకి ఆరు దేశాలను శాశ్వత సభ్యులుగా ఆహ్వానిస్తున్నట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా తెలిపారు.
ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, అర్జెంటీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా దేశాలు ‘బ్రిక్స్’ గ్రూప్లో చేరుతాయని, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ ఆరు దేశాల సభ్యత్వం అమలులోకి వస్తుందన్నారు సిరిల్ రామఫోసా.