ఎన్నికలకు సంబందించి కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఎండ తీవ్రత కారణంగా ఓటర్లను దృషలో పెట్టుకుని పోలింగ్ సమయాన్ని పొడిగించింది. లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని మరో గంటపాటు పెంచింది. ఉదయం 7 నుంచి సాయం త్రం 5 గంటల వరకు ఉన్న పోలింగ్ సమయా న్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించింది.
వేసవిలో మే 13న పోలింగ్ జరుగనున్నందున ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే సా యంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయాన్ని పెంచాలని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఈసీకి విజ్ఞప్తి చేశారు.దీనిపై సానుకూలంగా స్పందించిన ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.మరోవైపు నక్సల్స్ ప్రభావిత 13 అసెంబ్లీ నియోజకవర్గా ల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకు మా త్రమే పోలింగ్కు అనుమతించారు. రాష్ట్రంలో ఇప్పటికే 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం అనుకున్నంత స్థాయిలో జరుగడంలేదు. దీంతో పోలింగ్ సమయాన్ని పెంచాలని ఎన్నికల సంఘానికి పలువురు కోరారు. అన్ని రాష్ట్రాల్లో గంటపాటు సమయం పెంచినందున ఇక్కడ కూడా గంటపాటు పెంచేందుకు ఈసీ అనుమతి జారీ చేసింది.
ఇది కూడా చదవండి: కామెడీ కాదు..నిజమే..మోదీపై కమెడియన్ పోటీ.!