కమేడియన్ రంగీలా ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రధాని మోదీని అనుకరించే 29ఏండ్ల శ్యామ్ రంగీల కామెడీ ద్వారానే రాజకీయాలు చేస్తానంటూ ఏకంగా మోదీపైనే వారణాసీలో పోటీకి దిగుతానని ప్రకటించారు. మనస్పూర్తిగా తాను ఎన్నికల బరిలోకి దిగుతున్నానని తెలిపారు. నామినేషన్ వేసేందుకు వచ్చేవారం వారణాసికి వస్తున్నట్లు తెలిపారు. సూరత్, ఇండోర్ లా కాకుండా వారణాసి పౌరులకు ఓటేసే అవకాశం కల్పిస్తానని ఒకవేళ అందరు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నా తాను మాత్రం బరిలోనే ఉంటానని దీంతో తప్పక ఓటింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు. వాస్తవానికి తాను ఫకీర్ నని, తన దగ్గర ఏమీ లేదని..బ్యాగ్ తో వచ్చి దానితోనే వెళ్లిపోతానని .తనకు ఈడీల భయం లేదన్నారు.
ఇది కూడా చదవండి: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!