Friday, May 17, 2024

సత్తుపల్లిలో 1000 కోట్ల అభివృద్ది

spot_img

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో దివ్యాంగుల పెన్షన్ పెంపు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. ‘దివ్యంగుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని పని చేసిన ఏకైక ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం. దివ్యంగులను ఆదుకునేందుకు కృషి చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మాటలు చెప్పే ముఖ్యమంత్రి కాదు చేతలతో చేసి చూపించే ముఖ్యమంత్రి కేసీఆర్. కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాలలో ఎక్కడైనా 3 వేల రూపాయలు ఇస్తుందా?

దేశంలోనే ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు 4 వేలు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం. దేశంలో ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం. చేనేత భీమా,గీత కార్మికులకు పెన్షన్, బీడీ కార్మికులకి పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఎన్ టి ఆర్, వై యస్ ఆర్ లాంటి ముఖ్యమంత్రులు ప్రవేశ పెట్టిన పథకాలను కొనసాగిస్తూ అంతకంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్.

కేవలం సత్తుపల్లి నియోజకవర్గం లోనే ఇప్పుడు 1000 కోట్ల అభివృద్ది పనులు జరుగుతున్నాయి. ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం ను వచ్చే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా. నేను గతంలో తెలుగుదేశం లో ఉన్నప్పుడు పదవులు అనుభవించలేదు, ప్రజలు కార్యకర్తల కోసమే పని చేశాను. నేడు దైర్యంగా నియోజక వర్గం లో ఓటు అడిగే హక్కు ను ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పారు ఎమ్మెల్యే సండ్ర.

Latest News

More Articles