రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతూ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గుండెపోటుతో చనిపోయాడు. మహేశ్వరం మండల పరిధిలోని గట్టుపల్లికి చెందిన మణికంఠ (25) సాఫ్ట్వేర్ ఉద్యోగి. వీకెండ్ కావడంతో తన స్నేహితులతో కలిసి గ్రామంలోని కేసీఆర్ క్రికెట్ గ్రౌండులో క్రికెట్ ఆడుతున్నారు. అయితే మణికంఠ ఒక్కసారిగా కుప్పకూలడంతో అతని స్నేహితులు వెంటనే మహేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ గమనించిన వైద్యులు మణికంఠ గుండెపోటుతో చనిపోయాడని ధృవీకరించారు. ఆటఆడుతూ అందరితో కలియతిరిగిన మణికంఠ చనిపోవడంతో స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు.. చేతికందివచ్చిన కొడుకు తిరిగిరానిలోకాలకు పోయాడని బోరున విలపిస్తున్నారు.