బ్రెజిల్కు చెందిన ఫుట్బాల్ దిగ్గజం పీలేకు బరువెక్కిన హృదయాలతో కుటుంబ సభ్యులు, అభిమానులు వీడ్కోలు పలికారు.అంతకు ముందు విలా బెల్మిరో స్టేడియంలో పీలే భౌతికకాయానికి బ్రెజిల్ దేశాధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లలూ.. వేలమంది అభిమానులు, స్థానికులు సందర్శించి నివాళులర్పించారు.
Mourners in Brazil and across the world including Brazil’s President Luiz Inacio Lula da Silva, came out to pay their last respects and bid farewell to football legend Pele as his casket was taken through the city of Santos.#Pele | #Radio4UG pic.twitter.com/48P30wmpwx
— Radio 4 |103.3 Fm Ensunsuzi (@Radio4UG) January 4, 2023
పీలే అంతిమ యాత్రకు వేలాది మంది బ్రెజిల్ ప్రజలు తరలివచ్చి తమ అభిమాన ఆటగాడికి కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. సాకర్ చరిత్రలోనే అత్యంత మేటి ఆటగాడిగా గుర్తింపు పొందిన పీలే (82) డిసెంబర్ 30వ తేదీన అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.
21 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో మూడు ప్రపంచకప్లు ముద్దాడిన పీలే.. 1363 మ్యాచ్లాడి 1281 గోల్స్ చేశారు. ప్రపంచంలో మరే ఆటగాడు ఇన్ని గోల్స్ సాధించలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కించుకున్న పీలేను.. 2000 సంవత్సరంలో ఫిఫా ‘శతాబ్దపు అత్యుత్తుమ ఆటగాడి’గా ప్రకటించింది.
https://twitter.com/CineCharm_Offl/status/1610524287764398082