హైదరాబాద్ : నగరంలో మరోసారి ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ సందడి చేయనున్నది. ఫిబ్రవరి 11న ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్ నిర్వహించనున్నారు.
తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఈరోజు ఈవెంట్ టికెట్స్ ని విడుదల చేశారు. ‘ఫార్ములా- ఈ’ టికెట్స్ బుక్ మై షో లో అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ టికెట్ ను అరవింద్ కుమార్ కొనుగోలు చేశారు.
2023 హైదరాబాద్ E-prix పేరుతో ఈవెంట్ జరుగనున్నది. హుస్సేన్ సాగర్ తీరాన 300 కిలోమీటర్ల వేగంతో ఎలక్ట్రిక్ కార్లు దూసుకుపోనున్నాయి. 2.7 కిలోమీటర్ల రేసింగ్ ట్రాక్ కి FIA లైన్ క్లియర్ చేసింది. 22,500 టికెట్స్ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.