Sunday, May 12, 2024

హన్మకొండలో ఘోర ప్రమాదం.. 80గొర్రెలను, కాపరిని ఢీకొట్టిన రైలు

spot_img

హన్మకొండలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శాయంపేట రైల్వే గేటుదగ్గర రైలు ఢీకొని గొర్రెల కాపరి సహా 80 గొర్రెలు మరణించాయి. శాతవాహన రైలు వస్తుండటంతో శాయంపేట రైల్వే గేటు దగ్గర గార్డు గేటు వేశారు. అయితే రైలు అప్పుడే రాదనుకున్న కాపరి..తన గొర్రెలతో ట్రాక్ దాటే ప్రయత్నం చేశాడు. కానీ రైలు అనుకున్న దానికంటే వేగంగా రావడంతో గొర్రెలు పట్టాలపైనే ఉండిపోయాయి. వాటిని తప్పించే క్రమంలో కాపరిని కూడా శాతవాహన రైలు ఢీకొట్టింది. గొర్రెలతోపాటు కాపరి కూడా అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం ధాటికి గొర్రెలు పట్టాలపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: సెల్ ఫోన్ కి ఈ చిన్న రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా?

Latest News

More Articles