Friday, May 3, 2024

యాంకర్ రష్మీ ఇంట్లో తీవ్ర విషాదం.

spot_img

ప్రముఖ యాంకర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. తన కుటుంబ సభ్యుని కోల్పోయింది. ఈ విషయాన్ని చెబుతూ రష్మీ ఎమోషనల్ పోస్టు చేసింది. ఆమె షేర్ చేసిన ఫొటోలు చూసి RIP అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. తాను ఎంతో ప్రాణంగా పెంచుకుంటున్న తన పెంపుడు కుక్క చుట్కీని కోల్పోయింది. చుట్కీ గౌతమ్ ను కోల్పోయినందుకు చాలా బాధగా ఉందంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఎమోషనల్ గా పోస్టు చేసింది రష్మీ. తన పెంపుడు కుక్కతో దిగిన ఫొటోలను కూడా షేర్ చేసింది. చుట్కీకి అంత్యక్రియలు నిర్వహించిన ఫొటోలను కూడా షేర్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Rashmi Gautam (@rashmigautam)

చుట్కీ చితా భస్మాన్ని కారులో తన వెంట తీసుకెళ్తున్న ఫొటోలను కూడా పోస్టు చేసింది రష్మీ. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు రష్మీకి తన పెంపుడు కుక్క అంటే ఎంతో ఇష్టమో అర్థం అవుతుందని కామెంట్లు పెడుతున్నారు. కాగా రష్మీ జంతుప్రేమికురాలనే సంగతి తెలుసు. ఏ జంతువుకు హాని జరిగినా వెంటనే స్పందిస్తుంది. కోవిడ్ సమయంలో కూడా బయటకు వచ్చి వీధి కుక్కలకు అన్నం పెట్టింది. జంతు ప్రేమికురాలిగా ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చాలా వైరల్ అవుతుంటాయి.

ఇది కూడా చదవండి: హన్మకొండలో ఘోర ప్రమాదం.. 80గొర్రెలను, కాపరిని ఢీకొట్టిన రైలు

Latest News

More Articles