Saturday, May 18, 2024

హాస్టల్ బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలొదిలిన బీటెక్ యువతి

spot_img

నంద్యాల జిల్లాలోనీ పాణ్యంలో దారుణం చోటుచేసుకుంది. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కాలేజీ హాస్టల్ బాత్ రూంలో బిడ్డకు జన్మనిచ్చి, తీవ్ర రక్తస్రావంతో చనిపోయింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Read Also: కృష్ణానదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి

కల్లూరు మండలం చెట్ల మల్లాపురం గ్రామానికి చెందిన ఉమా మాధురి అనే విద్యార్థిని పాణ్యం ఆర్‎జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ సెకండియర్ చదువుతోంది. కాగా శుక్రవారం రాత్రి.. తనకు కడుపునొస్తుందని మాధురి బాత్రూంకి వెళ్లింది. అయితే ఎంతకీ తిరిగి రాకపోవడంతో తోటి విద్యార్థినిలు బాత్రూంకి వెళ్లి చూడగా.. ఉమా మాధురి రక్తం మడుగులో పడి ఉంది. పక్కనే ఆడ శిశువు ఉండటాన్ని గమనించి హాస్టల్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. మాధురి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి, అధిక రక్తస్రావంతో మృతి చెందినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అయితే మాధురిని మోసం చేసింది ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles