ఖమ్మం జిల్లా : పెనుబల్లి మండలం వీ.ఎం.బంజర్ పోలీస్ స్టేషన్ ముందు పురుగు మందు తాగి యువతి ఆత్మహత్య యత్నం చేయడం కలకలం రేపింది. అప్రమత్తమైన పోలీసులు ఆమెను పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుప్పెనకుంట్ల గ్రామానికి చెందిన మామిడి నాగరాజు.. తనను ప్రేమించి పెళ్ళికి నిరాకరించాడని వీ.ఎం.బంజర్ పోలీస్ స్టేషన్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాళ్ళగూడెంకు చెందిన యువతి స్వప్న ఫిర్యాదు చేసింది.
యువతి ఫిర్యాదు మేరకు యువకుడిని రప్పించగా.. పోలీస్ స్టేషన్ లో కూడా ప్రియుడు పెళ్ళికి నిరాకరించటంతో మనస్థాపనికి గురైన యువతి పోలీస్ స్టేషన్ ముందు పురుగుమందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది.