Sunday, May 19, 2024

అవయవదానంతో ఏడుగురి ప్రాణాలు కాపాడిన యువతి

spot_img

రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయన ఓ యువతి..ఏడుగురికి అవయవ దానం చేసి..వారి జీవితాల్లో వెలుగునింపింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం రామాపురం హరిజనవాడకు చెందిన కీర్తి(20) చెన్నైలోని ఓ ప్రైవేట్‌ కాల్‌ సెంటర్‌లో పనిచేస్తోంది. సంపత్‌ కుమార్‌, అమ్ములు దంపతుల కుమార్తె కీర్తి  ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో బీకామ్‌ చదివింది. చెన్నైలోని ఓ ప్రైవేట్‌ కాల్‌ సెంటర్‌లో పని చేస్తోంది.

పెళ్లి నిమిత్తం తన స్నేహితులతో కలిసి బైక్‌పై చెన్నై సమీపంలోని కరడిపుత్తూరుకు వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు కీర్తి. దీంతో కీర్తి బ్రెయిన్‌ డెడ్‌ అయిందని, కీర్తి అవయవాలను దానం చేయాలని జీహెచ్‌ ఆసుపత్రి డీన్‌, కీర్తి తల్లిదండ్రులను అభ్యర్థించారు. దీంతో కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. ఆమె అవయవాలను 7మందికి అందజేశారు. మరణించిన తర్వాత కీర్తికి నివాళులర్పిస్తూ చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో వాక్‌ ఆఫ్‌ హానర్‌ నిర్వహించారు.

Latest News

More Articles