Wednesday, May 22, 2024

రాష్ట్రంలో కార్పొరేషన్‌ చైర్మన్ల నియామకాలు రద్దు

spot_img

సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్‌ చైర్మన్ల నియామకాలను రద్దు చేసింది. ఈ మేరకు నియామకాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో 54 మంది కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్న సమయంలో ఆయా కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. గత ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్‌.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం మారడంతో ఇప్పటికే పలు కార్పొరేషన్ల చైర్మన్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల కింద సర్కారు.. ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న ఏడుగురిని తొలగించింది. వీరితో పాటు స్పెషల్ ఆఫీసర్ల నియామకాలను కూడా రద్దు చేసింది.

ఇది కూడా చదవండి: సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి

Latest News

More Articles