అచ్చంపేట: బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు ఎవరు కూడా సహనం కోల్పోవద్దని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ సూచించారు. తనపై దాడి చేసిన డాక్టర్ వంశీకృష్ణ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి, జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ ఒక వీధి రౌడీలా రాళ్లు విసరడం శ్రేయస్కరం కాదన్నారు. తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు.
Also Read.. పది హెచ్పీ మోటర్ కాంగ్రెసోడు కొనిస్తడా? మళ్లీ గోల్మాల్ అవుదామా?
ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని, ముఖ్యమంత్రి సీఎం కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ రౌడీ, గుండాలు ఓడిపోతామన్న భయంతోనే దాడులకు దిగుతున్నారన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సహనం పాటించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దాడిని జరిగిన అచ్చంపేట నియోజకవర్గం ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని ప్రజానీకాన్ని కోరారు.