Thursday, May 2, 2024

నాంపల్లి అగ్నిప్రమాదం: అపార్టుమెంట్ ఓనర్ పై కేసు నమోదు  

spot_img

హైదరాబాద్: బజార్ ఘాట్ సంఘటన చాలా దురదృష్టకరమని హోమ్ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ దుర్ఘటనలో మొత్తం 9మంది చనిపోయారని తెలిపారు. ఫైర్ యాక్సిడెంట్ అయిన వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటల్లో ఉన్న వాళ్ళని కాపాడారని చెప్పారు. ఘటనా స్థలాన్ని ఆయన సందర్శించి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.

Also Read.. ఢిల్లీ నుండి వచ్చే సీల్డ్ కవర్ సిఎంలు మనకు అవసరమా?

అపార్టుమెంట్ ఓనర్ రమేష్ జైస్వాల్ పై కేస్ నమోదు చేశాం. జరిగిన సంఘటన కి ఆయనే బాధ్యుడు. ప్రస్తుతం రమేష్ జైస్వాల్ హాస్పిటల్ లో ఉన్నారు. అక్రమంగా కెమికల్ డ్రమ్స్ నీ ఇంటి సెల్లార్ లో డంప్ చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. క్లుస్ టీమ్ కొన్ని ఆధారాలు సేకరించారు. ఆసుపత్రి లో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. 9మందికి పోస్ట్ మార్టం పూర్తి అయ్యిందని హోమ్ మంత్రి స్పష్టం చేశారు.

Latest News

More Articles