Monday, May 20, 2024

ఎగ్జామ్ రాసి వస్తుండగా ప్రమాదం.. లారీ కింద పడిన బీటెక్ యువతి

spot_img

మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యానంపేట వద్ద లారీ ఓ స్కూటీ ఢీకొట్టింది. దాంతో స్కూటీ మీద ఉన్న హర్షిత అనే బీటెక్ స్టూడెంట్ కిందపడటంతో ఆమె కాళ్లపై నుంచి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో హర్షితకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే హర్షితను సమీపంలోని శ్రీకర ఆస్పత్రికి తరలించారు. హర్షిత ఎగ్జామ్ రాసి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తోటి విద్యార్థినిలు చెప్పారు. ప్రమాదానికి కారణమైన లారీ (TS39 T3949)ని డ్రైవర్‎తో సహా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‎కి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: కేసీఆర్ ప్రమాణం చేశారు.. కొత్త ఇన్నింగ్స్ మొదలు కాబోతోంది

Latest News

More Articles