Saturday, May 11, 2024

దేవున్ని మొక్కుతున్న భక్తురాలిని ఢీకొన్న వాహనం.. అక్కడికక్కడే మృతి

spot_img

దేవున్ని మొక్కుతున్న భక్తురాలిని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన తిరుమలలో జరిగింది. శ్రీవారి దర్శనం అనంతరం తిరుమల నుండి తిరుపతికి వస్తున్న తుఫాన్ వాహనం.. తిరుమల ఘాట్ రోడ్డులోని 24వ మలుపు వద్ద అదుపు తప్పింది. పక్కనే ఆంజనేయ స్వామి వారిని మొక్కుతున్న మెదక్‎కు చేందిన పార్వతమ్మను ఢీ కొని, ప్రక్కనే ఉన్న పిట్ట గోడను ఢీకొని ఆగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో పార్వతమ్మ సంఘటన స్ధలంలోనే మృతి చేందగా, తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే క్షతగాత్రులను హుటాహుటిన తిరుపతి రుయా ఆసుపత్రికి తరలిస్తుండగా రాయదుర్గంకు చేందిన రేణుకమ్మ మృతి చేందింది. మిగిలిన ఐదుగురు చికిత్స పొందుతున్నారు. కాగా.. మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరగడంతో ట్రాఫిక్‎కు అంతరాయం కలిగింది. వాహనాలు ఎక్కడిక్కడ నిలిచి పోవడంతో టీటీడీ‌ విజిలెన్స్, ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్‎ను క్రమబద్దీకరించారు.

Latest News

More Articles