Sunday, May 19, 2024

రిసెప్షన్‎కు వెళ్లొస్తుండగా యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

spot_img

సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన జరిగింది. రిసెప్షన్‎కు వెళ్లి వస్తున్న పెళ్లి బృందం వాహనం.. ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన పటాన్ చెరు మండలం రుద్రారాం వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. చిట్కుల్ గ్రామానికి చెందిన రామచంద్రయ్య కూతురు పెళ్లి రెండు రోజుల క్రితం జరిగింది. శుక్రవారం రాత్రి అబ్బాయి తరపు వారు రిసెప్షన్ ఏర్పాటుచేశారు. దాంతో రామచంద్రయ్య కుటుంబం బంధువులతో కలిసి రిసెప్షన్ కు హాజరైంది. అనంతరం రాత్రి చిట్కుల్ కు తిరుగుపయనమయ్యారు. అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం.. రుద్రారాం వద్ద రోడ్డు నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరో 35 మందికి స్వల్ప గాయాలుకాగా.. వారందరినీ సమీపంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. గాయపడిన వారిలో పెళ్లికూతురు కూడా ఉండటం గమనార్హం. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles