Friday, May 3, 2024

వరుణ్‌తేజ్‌ ‘గాంఢీవధారి అర్జున’ ట్రైలర్‌ విడుదల

spot_img

ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున. ఆగస్ట్‌ 25న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేశారు. డిసెంబ‌ర్ 2020లో దేవుడు మీద మ‌నిషి గెలిచాడంట‌.. అంటూ మొదలయ్యే నాజ‌ర్ సంభాషణలతో ట్రైల‌ర్ మొద‌లవుతుంది.

దేశ రక్షణ విషయంలో తలెత్తిన ఓ పెద్ద సమస్య నుంచి కాపాడటానికి అర్జున్‌(వరుణ్ తేజ్) కు ఎదురైన సవాళ్లు, చేపట్టిన ఆపరేషన్‌ లతో ట్రైలర్ సాగుతుంది. వరుణ్‌తేజ్ యాక్షన్‌ సన్నివేశాలతో ట్రైలర్‌ ఉత్కంఠగా సాగింది. సాక్షి వైద్య ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. విమలారామన్‌, నాజర్‌, వినయ్‌ రాయ్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Latest News

More Articles