శంషాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అరకిలో అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ప్లయాణికుడి వద్ద ఉన్న 552 గ్రాముల అక్రమ బంగారాన్ని సీజ్ చేశారు.
బంగారాన్ని లోపలి జేబులో దాచుకుని వచ్చిన ప్రయాణికుడిపై అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించగా బంగారం గుట్టు రట్టయింది. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు విచారణ చేపట్టారు. పట్టు బడ్డ బంగారం విలువ దాదాపు రూ.33.53 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.